Mayabazar | NTR | Sri krishna | Mogul A Azam | 30న ప్రేక్షకుల ముందుకు రంగుల "మాయాబజార్"!
WD
కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30వ తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా గోల్డెన్ సంస్థ ప్రతినిధి వాకాడ అప్పారావు ఆదివారం నాడు మాట్లాడుతూ.. 50 నుంచి 60 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. గోల్డ్స్టోన్ టెక్నాలజీ, కలర్ టెక్నాలజీ డెవలప్చేసి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. జి. జగన్మోహన్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుందని అప్పారావు చెప్పారు.
జగన్మోహన్ మాట్లాడుతూ.. కలర్, సంగీతం ఏమాత్రం తేడా లేకుండా 165 మంది టెక్నికల్ టీమ్తో దాన్ని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. జాతీయస్థాయిలో "మొగల్ ఎ అజామ్" చిత్రం తర్వాత మళ్లీ కలర్ఫుల్గా వచ్చిన చిత్రమిది. మాయాబజార్లో ఉన్న కలర్స్ను ఏ చిత్రంలోను వాడలేదు.
నెగెటివ్గా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి, అందులో ఏవి పనికి వస్తాయో? ఏవి డామినేట్ చేస్తాయో? అని ప్రతి క్షణం ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించారు. టెక్నాలజీ అమెరికా ఇచ్చినప్పటికీ ఆంధ్రులే "మాయాబజార్"ను అద్భుతంగా రూపొందించారు.
ఈ సినిమాను చూసి అమెరికా కంపెనీలు పది సినిమాల ఆఫర్లు కూడా ఇచ్చారు. మాయాబజార్ కలర్గా మార్చడానికి దాదాపు ఐదు కోట్లు ఖర్చైంది. ఇదేదో డబ్బు కోసం ఈ చిత్రానికి పనిచేయలేదు. మన పనివిధానం ప్రపంచానికి తెలియజేయడానికే చేశాం. భవిష్యత్లో మరిన్ని విదేశీయులకు చెందిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కూడా కలర్ఫుల్ చేసే ఆలోచన ఉంది" అని జగన్మోహన్ వెల్లడించారు.
