హాస్యనటుడు వేణుమాధవ్ హీరోగా నటించిన ప్రేమాభిషేకం చిత్రం ఎస్ఎస్ విక్రమ్గాంధీ దర్శకత్వంలో రూపొందింది. చంద్రబోస్ పాటలను అందించిన ఈ చిత్రానికి స్వరకల్పన చక్రి సమకూర్చారు. అలాగే ఈ చిత్రానికి మూలకథను దాసరి నారాయణరావు అందించారు.
రుతిక, గీతాసింగ్, ప్రియామోహన్లు వేణు సరసన హీరోయిన్లుగా నటించారు. గతంలో అశేషాంధ్ర ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రేమాభిషేకం చిత్రంలో అలనాటి అక్కినేని నాగేశ్వరరావు నటనను పండించారు. లేటెస్ట్ ట్రెండ్లకనుగుణంగా, వినోదాత్మకంగా తీసిన కొత్త ప్రేమాభిషేకంలో వేణుకు క్యాన్సర్ ఉండదు. దీనిపైనే మొత్తం కథంతా నడుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన దృశ్యాలను ట్రెయిలర్లో వీక్షించవచ్చు.