2005లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న గద్దె సింధూర తెలుగులో నటించిన తొలి చిత్రం "సంగమం". "ఒకరికి ఒకరు" ఫేం రసూల్ దర్శకత్వంలో ప్రవాసాంధ్రుడు రమణ పెమ్మరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహిత్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మలిచారు.
ప్రేమ సజీవమైందన్న బ్యాక్డ్రాప్తో చిత్ర కథ నడుస్తుంది. మురళీ మోహన్, రాఘవ, సుబ్బరాజు, రఘునాథ్ రెడ్డి, విజశ్రీ, అనిల్స, ఆనంద్ వర్మ తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.
|