సంఘఆర్టక్రియేషన్స్ పతాకంపై సాయి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆట మొదలైంది'. ఈ చిత్రాన్ని టి.శైలేష్ కుమార్ యుధిష్టర సిన్హా సంయుక్తంగా నిర్మించారు. అనీస్ఖాన్, ప్రతిష్ట ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
పూర్తిగా కొత్త వారితో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్కు చక్కని సందేశం అందించేలా రూపొందించారు. జీవితంలో తమాషా ఉండవచ్చు గాని.. జీవితమే తమాషా కాకూడదు అన్న పాయింట్ను ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు.
అల్లరి చిల్లరగా తిరిగే ఓ యువకుడు ఒకానొక సంఘటనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆ విద్యలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడమే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ట్రెయిలర్ రూపంలో మీకోసం...
|