ఋషి, రాజీవ్ కనకాల, శాంతిచంద్ర ప్రధాన పాత్రలో శేఖర్ సూరి దర్శకత్వంలో రాజ్(ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న చిత్రం 'త్రీ'. హార్రర్, సస్పెన్స్ చిత్రమేమీ కాదని, ఒక వైవిధ్యమైన కథాంశంతో రూపొందించిన చిత్రమని దర్శకుడు శేఖర్ సూరి అన్నారు.
ప్రతి సన్నివేశంలో ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. 'ఏఫిల్మ్ బై ఆరవింద్' సినిమాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. విభిన్నమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీ కోసం...
|