గీతా ఆర్ట్స్ పతాకంపై పవన్కళ్యాణ్ హీరోగా ఇలియానా, కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్ హీరోయిన్లు నటించిన చిత్రం "జల్సా". రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.28 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించారు.
నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా రిలీజ్ చేసిన ఈ చిత్రం 400 ప్రింట్లతో వెయ్యి థియేటర్లలో విడుదలైంది. ఒక్క జంటనగరాల్లోనే 52 థియేటర్లలో జల్సాను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. వంద రోజుల పాటు విజయవంతంగా ఆడుతున్న "జల్సా"లోని కొన్ని సన్నివేశాలు ట్రైయిలర్ రూపంలో మీ కోసం..
|