సస్పెన్స్ థ్రిల్లర్ త్రీ ట్రైలర్ మీకోసం...
|
తన స్నేహితుని జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకుడు వెల్లడించారు. సరికొత్త థ్రిల్లర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. సాంకేతికంగా అత్యున్నత విలువలతో చిత్రీకరించామని, ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాకు అదనపు బలాలని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ఖచ్చితంగా హాలీవుడ్ సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుందన్నారు. తెలుగులోనే తొలిసారిగా బెలూన్రైట్లో చిత్రీకరణ జరిపామని తెలిపారు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా భారీ బడ్జెట్తో రూపొందించామన్నారు. కథకథనాలు వైవిధ్యంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం...
