డాక్టర్. రాజశేఖర్, నీతుచంద్ర, సంజన, హీరోహీరోయిన్లుగా నటించి తెరకెక్కిన చిత్రం "సత్యమేవజయతే". జీవిత స్వీయ దర్శకత్వంలో, శివానీ శివాత్మిక మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం. సత్యనారాయణరావు ముఖ్యమంత్రిగా నటించారు.
హిందీ చిత్రం ఖాకీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ కథాగమనాన్ని చాలా వరకు మార్చి తెరకెక్కించామని రాజశేఖర్ వెల్లడించారు. ఇంకా రాజశేఖర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఎవడైతేనాకేంటి..?" చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందించానని, ఆ సినిమా ఇచ్చినసక్సెస్ స్ఫూర్తితో "సత్యమేవజయతే" కథ రాశానని అన్నారు. "అంకుశం" తరహాలో సాగే ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇదని రాజశేఖర్ తెలిపారు.
ఇటీవలే విడుదలై థియేటర్లలో మాస్ను అలరిస్తోన్న చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.