జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "సిద్ధం". ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని కిరణ్కుమార్ నిర్మించారు.
"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో, టాస్క్ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారని నిర్మాత అన్నారు. సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు. "ఇంజనీర్లు భవనాలు నిర్మిస్తారు.. డాక్టర్లు వైద్యం చేస్తారు.. నేను చంపుతాను" - అనే పాత్ర జగపతిబాబుదని తెలిపారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.