శశికాంత్, కిరణ్ రాథోడ్ హీరోహీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, కీ.శే. రఘువరన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం "సిద్ధు" (వీడు దేనికైనా రెడీ...).
చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రసాద్ సినిమా గురించి చెబుతూ.. నిర్మాతగా తనకిది 19వ చిత్రమని, 14వ చిత్రంగానే దీన్ని నిర్మించానని, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందన్నారు. లవ్స్టోరీతో రూపొందే యాక్షన్ చిత్రమిదని, అశోక్ యాదవ్, రామిరెడ్డి విలన్లుగా నటిస్తున్నారని వివరించారు.
శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా... కిషన్ సాగర్, ఆర్ట్.. విజయ్ సాగర్, సంగీతం... దేవా, నిర్మాణ నిర్వహణ... సి. నాగిరెడ్డి, ప్రభాకర్, నిర్మాత, దర్శకుడు... జి.వి.హెచ్. ప్రసాద్.
ఈ చిత్రంలోని కొన్ని అద్భుత సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..