రాజా, తీర్థ హీరోహీరోయిన్లుగా, పి. సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సొంతఊరు" శ్రావ్య ఫిలింస్ పతాకంపై వై. రవీంద్రబాబు, కిషోర్ బసి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజా నాన్ గ్లామరైస్డ్ పాత్రను పోషించాడు.
ఈ చిత్రం గురించి దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... 'సాంకేతిక విలువలతో ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుందన్నారు. పల్లె జీవితంలోని అందాలు, సుఖ సంతోషాలు, ఆధునికత వైపు అవి తీసే పరుగులు లాంటి అంశాలు ప్రేక్షకులను అలరిస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఎల్బీ శ్రీరామ్, తనికెళ్ళ భరణి, విజయ చందర్లు అద్బుతమైన నటనను ప్రదర్శించారని దర్శకుడు కొనియాడారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో మీ కోసం..