రాజీవ్ కనకాల, నవనీత్ కౌర్, కౌశ, నాగేంద్రబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "ఫ్లాష్ న్యూస్". జన్యావుల శేషయ్య సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అశోక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పుల్లేటి దుర్గామోహన్, సింగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సమాజంలో మీడియా పాత్ర గురించి తెలిపేదే తమ ఫ్లాష్ న్యూస్ అని నిర్మాతలు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర చాలా గొప్పది. జర్నలిజం అంటే ఏమిటి?, జర్నలిస్టుల పైన ఉన్న బాధ్యతలు, వాళ్ళు చెయాల్సిన పనులు ఈ చిత్రం ద్వారా వివరిస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.