సురేష్గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్లో టాలీ టు హాలీ పతాకంపై రూపొందుతున్న చిత్రం "ఆ ఒక్కడు". సుధాకర్ నిర్మిస్తున్నఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. చిన్న థ్రిల్లర్ పాయింట్తో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు.
ఒక సంఘటన చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతాన్ని అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో రచన మౌర్య ఐటం సాంగ్ చేస్తోందని, సునీల్ పాత్ర సీరియస్గా ఉంటూ కామెడీ పండిస్తుందని ఆయన వెల్లడించారు.