ఉదయ్, ప్రియాంక జంటగా నటించిన చిత్రం "పరారే". ఎం.వెంకటేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్నుపాటి వెంకటేశ్వరరావు నిర్మించారు.
ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. అందరి సహకారంలో సినిమాను చక్కగా తెరకెక్కించామన్నారు. ఈ చిత్రానికి జి.మురళీస్వర్ సంగీతం సమకూర్చారని ఆయన వివరాలందించారు.
వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను పరారే ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఓ ప్రేమజంట పెళ్లికోసం చేసే పోరాటమే ఈ చిత్రకథని ఆయన అన్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో తిలకించండి.