"రేచర్ల మూవీ క్రియేషన్స్" పతాకంపై రేచర్ల సుభాష్ నాయుడు నిర్మించిన తొలి చిత్రం ‘జల్లు’. వి.వి.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా చికాగోలో "సిఎమ్ ఇ గ్రూఫ్" సాప్ట్వేర్ ఉద్యోగి "జయంత్ పృథ్వీరాజ్" కథానాయకుడిగా పరిచయమయ్యారు. రేచర్ల, ప్రేరణ హీరోయిన్లుగా నటించిన ఈ చి
ఈ సినిమాకు అనంత్ శ్రీరామ్ పాటలు రాయగా, నిహాల్ సంగీతం సమకూర్చారు. బాలు, సునీత, హేమచందర్, వేణు, ప్రణవీల గాత్రంతో జల్లు పాటలు శ్రోతలను ఎంతగానో మెప్పించాయని నిర్మాత సుభాష్ నాయుడు అన్నారు.
ఇక కథ విషయానికొస్తే... ప్రపంచ దేశాలన్నింటిని కదిలిస్తున్న ప్రధాన సమస్యని దృష్టిలో ఉంచుకొని, ప్రేమకథా నేపథ్యంలో యువతకు ఒక సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాత వెల్లడించారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని దర్శక, నిర్మాతలు అన్నారు. ఇంకా ఈ సినిమాకు కెమెరా: జోషి, రేడియోమిర్చి భూపాల్.
ఇప్పటికే ప్రేమ "జల్లు"తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.