గోపీచంద్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'శంఖం'. ఇందులో తమిళ నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయని దర్శకుడు శివ అన్నారు.
జె.భగవాన్, జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉందని దర్శకుడు వెల్లడించారు. 'శౌర్యం తర్వాత గోపీచంద్ తో కలిసి చేస్తున్న చిత్రమిదని, మాస్, యాక్షన్ అంశాలతో పాటు కుటుంబ బంధాలతో ముడిపడ్డ కథతో శంఖం చిత్రం రూపుదిద్దుకుంటోందని దర్శకుడు తెలియజేశారు.
కథానాయకుడు ప్రత్యర్థులపై ఏ సందర్భంలో 'శంఖం' పూరించాడన్నది తెర మీదే చూడాల్సిందేనని నిర్మాతలు అన్నారు. ఇందులో గోపీ, త్రిషల పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయని వారు తెలిపారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.