మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.
అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకంపై రూపొందించిన ఈ మొదటి చిత్రం థియేటర్లరో ప్రేక్షకులను అలరిస్తోంది. నూతన దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్ సరసన 'ముని' ఫేం వేదిక కథానాయికగా నటించింది.
నారా వారి కుటుంబం నుండి తెలుగు వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంలోనే స్మార్ట్ హీరోగా మార్కులు కొట్టేసిన రోహిత్ను చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా సంతోషంలో ఉన్నారు. మంచి సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూడండి.