అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్య-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నవదీప్, శ్రద్దాదాస్ మరో జంట నటిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు ఈ చిత్రానికి నిర్మాతలు.
చిత్ర నిర్మాత ఆదిత్య బాబు మాట్లాడుతూ... ఈ చిత్ర కథ భిన్నమైనది. శంకర్ దాదా జిందాబాద్ తరహాలో వైవిధ్యంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఆర్య అనేది ఎప్పటికీ సుకుమార్దే. ఇద్దరు హీరోలు నటిస్తే ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. కానీ సరదాగా గడిచింది. నవదీప్కు కృతజ్ఞతలు అని చెప్పారు.