అంతేకాక పిల్లల్లో వయస్సు పెరిగేకొద్ది ఫాస్ట్ఫుడ్ వారి ప్రధాన ఆహారంగా మారిపోతుంది. దీనిని బలపరస్తున్నట్లుగా ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో 66 శాతం మంది ఫాస్ట్ఫుడ్కు తమ ఓటు వేసారు. తల్లిదండ్రులతో పాటుగా స్కూల్ టీచర్లు చొరవ తీసుకుని విద్యార్థులలో అవగాహన కలిగించడం ద్వారా వారిని ఊబకాయం నుంచి దూరం చేయవచ్చునని సర్వే ఫలితాలువెల్లడించాయి.
టెలివిజన్లోని ప్రకటనల కారణంగా తమ పిల్లలు ఫాస్ట్ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా స్కూల్ ఆవరణలో ఫాస్ట్ఫుడ్ను నిషేదించడం ద్వారా పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు స్కూల్ యాజమాన్యాలు తెలుపుతున్నాయి.
|