1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథలు

పరమానంద పరోపకారం

చాలాకాలం క్రితం ధర్మపురి రాజ్యంలో పరమానంద అనే ధనవంతుడు
చాలాకాలం క్రితం ధర్మపురి రాజ్యంలో పరమానంద అనే ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పరమ పిసినారి. ఒకరోజు అతను రోడ్డుపై నడుసుండగా, జిలేబీ అంగడిని చూశాడు. అతనికి వాటిని తినాలనే కోరిక కలిగింది. కాని వాటిని కొనడానికి డబ్బు అవసరం. పైగా, అంగడి వద్దే తింటే పక్కన ఉన్న వారికి కూడా పెట్టాల్సి వస్తుంది. అది ఇష్టం లేని పరమానంద ఒక పధకం పన్నాడు. దాని ప్రకారం వెంటనే అతను ఇంటికి చేరుకొని, పనివాడిని పిలిచాడు. వాడికి డబ్బు ఇచ్చి అంగడి నుంచి జిలేబి తీసుకొని ఇంటికి కాకుండా ఊరు చివర కొలను వద్ద గల పొదల వద్దకు తీసుకు రమ్మని చెప్పాడు.

ఈ పరిస్ధితులలో ఒకవైపు పరమానంద జిలేబిలను తినేందుకు ప్రయత్నిస్తూంటే, మరోవైపు అచ్చం అతనిలానే ఉన్న మరో నకిలీ వ్యక్తి రాజుగారుతో ‘నేను నా సంపదలో సగభాగాన్ని పేదలకు దానం చేయాలని నిశ్చయించుకున్నాను, కనుక దయఉంచి మీరు ఇందుకు అనుమతించాలి‘ అని కోరాడు. దానికి రాజు సంతోషంగా సమ్మతించి, అతడిని అభినందించాడు.

పరమానందలో వచ్చినఈ మార్పునకు సభలో ఉన్న వారందరూ ఆశ్చరపడటమే కాక, ఈ హఠాత్తు పరిణామానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని ఆలోచించసాగారు. అప్పుడు నకిలీ పరమానంద సభ నుంచి నేరుగా, అసలు పరమానంద ఇంటికి నెళ్ళి, పనివాడితో ‘అచ్చు తనలాగే ఉన్న మరో మనిషి గ్రామంలో తిరుగుతున్నాడని, అతను కనుక ఇంటికి నస్తే నిర్ధాక్ష ణ్యంగా కొట్టి, బంధించమని‘ ఆజ్ఞాపించాడు.
About Writer
WD