"రమా! మన పెళ్ళయి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయింది. మన బాబుకు కూడా ఊహ బాగా తెలుస్తోంది. అయినా కూడా నీ గయ్యాళితనం మాత్రం తగ్గడం లేదు. కనీసం ఇక నుంచైనా నువ్వు మాటిమాటికీ నామీద విరుచుకుపడకుండా వుండేందుకు ప్రయత్నించు" అంటూ ప్రకాష్ భార్యను రాత్రి బెడ్రూమ్లో అర్ధించాడు.
"ఏం? ఎందుకు వుండాలి? నీ మొహానికి రెండు లక్షలు కుమ్మరించాడు మా నాన్న. ఇప్పటికీ ఇంటికి కావలసిన అవసరాలన్నీ మానాన్నే తీరుస్తున్నాడు. ఇంకెవరైనా అయితే నీ బోడి గుమాస్తా మొహానికి పదివేలు కూడా ఇచ్చి వుండరు. నోరు మూసుకొని పడుకో టైం పదిగంటలవుతోంది" అంటూ గదమాయించింది శూర్పణఖలాంటి రమ తన భర్త ప్రకాష్ను.
"ఏరా ప్రకాష్ ఎన్ని రోజులు రా నీ హైదరాబాదు క్యాంప్?" ప్రశ్నించాడు అతని స్నేహితుడు కిరణ్. "రెండు రోజులేరా" అన్నాడు. "ఇంకో రెండు రోజులు ఉండొచ్చుగా?" అన్నాడు కిరణ్. "అమ్మో ఇంకేమైనా వుందా రేపు సాయంత్రానికి ఇంటికి వెళ్ళకపోతే నా తోలు ఒలిచేస్తుందిరా మా ఆవిడ." "అయితే ఇప్పటికీ మీ ఆవిడలో మార్పేమీ రాలేదా? పోనీ మీ ఆవిడ దేనికి భయపడుతుందో ఈ ఐదు సంవత్సరాలలో ఏమయినా తెలుసుకున్నావా?"అని కిరణ్ అడిగాడు.
"మా ఆవిడ దేనికీ భయపడదురా? ఈ ఒక్క దానికి తప్ప..." "అయితే ఫ్లాష్ లాంటి ఐడియా చెప్తాను నీ చెవి ఇటివ్వు".. "నో ... నేనలా చేయలేనురా కిరణ్! ఇంకేదయినా మార్గం ఉంటే చెప్పు". "సరే ఇంకో మార్గముంది... ఇలాగైనా చెయ్యి. అదీ రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడే చెయ్యి". "మా గయ్యాళి కనుక మారితే నీ మేలు ఈ జన్మలో మరిచి పోనురా"అన్నాడు ప్రకాష్. |