ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
పుష్ప ప్రియుడు దేవదేవుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పాలంకార ప్రియుడన్నది జగద్విదితం. స్వామి ప్రతి నిత్యం వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తుంటారు. వేకువ జామున సుప్రభాతసేవ మొదలు, రాత్రి ఏకాంత సేవానంతరం విశ్రాంతి వరకు శ్రీవారికి పుష్పకైంకర్యాన్ని నిర్వహిస్తారు. ప్రతి రోజూ సుమారు 150 కిలోల పుష్పాలను స్వామివారి సమర్పణకు వినియోగిస్తారు. శ్రీవారి ఆలయ సన్నిధిలోని మూలవర్లకు సాలిగ్రామ, శిఖామణి, కంఠహారం, తాయారు తదితర పూలమాలలను అలంకరిస్తారు.

ఉదయం, సాయంత్రం తోమాల సమయంలో స్వామివారికి పుష్పాలంకరణ జరుగుతుంది. వీటితో పాటు అదనంగా ఆలయ రంగనాయకుల మండపంలో నిర్వహించే కళ్యాణోత్సవ సేవకు ఉత్సవరులను కళ్యాణమాలలతో అలంకరిస్తారు. వీటిలో ఒక వంతు పూలు తితిదే వనాల నుంచే సేకరిస్తారు. మూడు వంతులు వివిధ ప్రాంతాల నుంచి విరాళాలుగా వస్తాయి. ఇది నిత్యపుష్ప వైభోగం.
మరిన్ని
బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు
హంస వాహన సేవపై ఊరేగనున్న 'దేవ దేవుడు'
ఆదిశేషునిపై ప్రేమకు నిదర్శనం 'చిన్నశేష' వాహనం
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు
వైభవంగా శ్రీవారి ధ్వజారోహణ
శ్రీ వేంకటేశ్వరుని పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్సార్