ఉప్పుపై ఆంగ్లేయ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో చేపట్టిన మహోజ్వలమైన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి 1930వ సంవత్సరం మార్చి 12వ తేదీన మహాత్మాగాంధీ దండి యాత్రను ప్రారంభించారు.
గుజరాత్ సముద్రం తీరం వెంబడి 400 కి.మీ.ల పాటు సాగిన మహాత్ముని యాత్ర 1930వ సంవత్సం ఏప్రిల్ ఆరవతేదీన దండిని చేరుకుంది. అక్కడే, మహాత్ముని సమక్షంలో వేలాదిగా ప్రజలు చట్టవిరుద్ధంగా సముద్ర జలాల నుంచి స్వంతంగా ఉప్పును తయారు చేసారు.
ఈ నేపధ్యంలో 1930వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో కలకత్తా నగరంలో పోలీసులకు, జనసమూహానికి మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో (1930-31) దాదాపు లక్షమంది ప్రజలు జైలు పాలు కాగా, పెషావర్లో జరిగిన ఖిస్సా ఖ్వాని బజార్ సమూహ సంహారంలో ఆయుధాలు లేని ఉద్యమకారులపై కాల్పులు జరిగాయి.
|