సంపూర్ణ స్వతంత్ర్యం అనే పేరును మొట్టమొదట ఉచ్చరించిన మహామహుడు అరవిందర్. భారత స్వతంత్ర్య పోరాటంలో ఉద్వేగంగా, దేశాభిమానాన్ని నేతాజీకి ఉపదేశించిన అరవిందర్ ఆగస్టు 15వ తేదీ కొత్త యుగ ఆవిర్భావానికి నాందని చెప్పారు. పాతయుగానికి స్వస్తి పలికి ఈ రోజును భారతీయులు ఏనాటీకీ మరువలేరని పేర్కొన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఈ రోజున నేను పుట్టాననడం గొప్ప గౌరవమని చెప్పారు. భవిష్యత్తులో భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో కొత్త యుగాన్ని భారతదేశం ప్రారంభించనుందని తెలిపారు. భగవంతుని సంకల్పంతో జరగాల్సిన కార్యకలాపాలను స్వయంగా చూసేందుకు వీలు కలిగిందని అరవిందర్ చెప్పారు.
స్వాతంత్ర్య భారతావనిలో ప్రతి విషయం ముఖ్యత్వాన్ని వహిస్తుందని ఆయన చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించి దేశం స్వాతంత్ర్యం సాధించింది. అయితే ఏకత్వం ఇంకా పూర్తిగా సాధించలేదు. ఐకమత్యమే భారతదేశానికి ముఖ్యమైన ఆయుధమని అరవిందర్ అన్నారు.
|