ప్రధాన పేజి   ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > స్వాతంత్ర్య దినోత్సవం
 
భారత స్వాతంత్ర్యోద్యమంలో నెత్తుటి మరకలు
రౌలట్ చట్టం ద్వారా 1919 సంవత్సరంలో సంస్కరణ తాలూకూ సత్ఫలితాలు తీవ్రంగా అణచివేయబడ్డాయి, "పాలకులపై ధిక్కార కుట్ర"ను పరిశోధించే నిమిత్తం నియమించబడిన రౌలట్ సంఘం రాచరిక శాసన మండలికి నివేదించిన ప్రతిపాదనల అనంతరం రౌలట్ చట్టం అమలులోకి వచ్చింది. చట్టం ద్వారా వైస్రాయ్ ప్రభుత్వానికి విశేషాధికారాలు సంప్రాప్తించాయి.

చట్టాన్ని ఆసరాగా తీసుకున్న ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు ఆంక్షలు, ఎలాంటి విచారణ లేకుండానే రాజకీయ కార్యకలాపాలపై నిషేధం, ముందస్తు వారంటు లేకుండానే రాజద్రోహం వంకతో వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించింది. దీంతో రౌలట్ చట్టాన్ని ప్రజలు నిషేధిత చట్టంగా పిలవడం ప్రారంభించారు. చట్టం పట్ల ప్రజలలో నిరసన జ్వాలల జాతియావత్తూ వ్యాపించాయి. దేశంలో అక్కడక్కడా నిరసనోద్యమాలు హర్తాళ్ల రూపంలో ఆరంభమయ్యాయి.

ప్రజల నిరసనను తీవ్రంగా అణిచివేసే దుష్ట పన్నాగానికి 1919 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లోగల జలియన్‌వాలా బాగ్ వేదికగా మారింది. జలియన్‌వాలా బాగ్ సామూహిక సంహారానికి ( దీనినే అమృత్‌సర్ సామూహిక సంహారమని చరిత్రకారులు చెపుతారు ) నాయకత్వం వహించిన జనరల్ రెగినాల్డ్ డయ్యర్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నెత్తుటి మరకలు అంటించిన దురహంకార బ్రిటీష్ జనరల్‌గా మిగిలిపోయాడు.
1| 2| 3
మరిన్ని
ఝాన్సీరాణి చివరి మాట... జై హింద్!
భారత కీర్తిని ఇనుమడింపజేసిన సానియా
దేశం గర్వించదగ్గ మహిళా ఐపీఎస్ అధికారిణి
ఆంగ్లేయులపైకి దూసుకొచ్చిన బులెట్... నేతాజీ
దేశ తొలి మహిళా అధ్యక్షురాలు ప్రతిభా పాటిల్
తొలి స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అరవిందర్ సందేశం