60 ఏళ్లంటే మన దేశంలో షష్టిపూర్తి వేడుకలు జరుపుకుంటారు. అయితే భరతమాత మాత్రం ఈ 60ఏళ్లలో అత్యంత శక్తివంతమైన యువ శక్తిని దేశానికి అందించింది. తెల్లదొరల పాలనా పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్న తర్వాత మన దేశం దాదాపు అన్ని రంగాలలోను అభివృద్ధిని సాధిస్తూ ముందడుగు వేస్తోంది. పొరుగుదేశాలతో జరిపిన యుద్ధాలలో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకున్నది. పోఖ్రాన్ వంటి అణు పరీక్షలు జరిపి అణుశక్తి సామర్థ్యం కలిగిన అగ్రరాజ్యాల సరసన స్థానం సంపాదించుకుంది.
భారత దేశానికున్న బలాలు ఇటువంటివైతే మరికొన్ని సవాళ్లు భారత్ను పట్టి పీడిస్తున్నాయి. వాటిలో తీవ్రవాదం ప్రధానమైనది. దేశంలో ఏదో ఒక మూలన తీవ్రవాద కార్యకలాపాల వల్ల అమాయక ప్రజలు బలైపోతూనే ఉన్నారు. భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. వీటన్నిటినీ భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తిప్పికొడుతూ తన ఆధిపత్యాన్ని చాటుతోంది.
అయితే స్వాతంత్ర్య సమరానికి ముందు వెనుక ఎన్నో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. బాపూజి వంటి పలువురు త్యాగమూర్తులను కోల్పోయిన భరతమాత ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. గతకాల చక్రంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘటనలు మీ కోసం....
* 1600లో ఈస్ట్ ఇండియా కంపెని స్థాపనతో బ్రిటిష్వారి రాక * 1757లో జరిగిన ప్లాసీ యుద్దంలో బ్రిటిష్వారు బెంగాలును ఆక్రమించుకున్నారు. * 1836లో మొట్టమొదటిసాగిగా వందేమాతర గీతాన్ని బకించంద్ర ఛటర్జీ ఆలపించారు. * 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే `సిపాయిల తిరుబాటు` జరిగింది. * 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రస్ ఏర్పడింది. * 1901లో శాంతినికేతన్ని స్థాపించారు. * 1902లో అనుశీలన్ సమితిని కలకత్తాలో ప్రమంత్ మత్ మిత్ర స్థాపించారు. * 1905లో బెంగాల్ విభజన జరిగింది. * 1906లో ఆల్ ఇండియా ముస్లింలీగ్ని స్థాపించారు. * 1907లో కాంగ్రెస్ పార్టీ అతి వాదులు, మిత వాదులు అనే రెండు వర్గాలుగా చీలిపోయింది.
* 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్ తరుపున పది లక్షల మందికిపైగా సైనికులు పాల్గొన్నారు. * 1915వ సంవత్సరం నుండి గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. * 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసేంట్ ప్రారంభించారు. * 1916లో పింగళి వెంకయ్య తయారుచేసిన త్రివర్ణ పతాకాన్ని లక్నో సమావేశంలో ఎగురవేశారు. * 1919 ఏప్రిల్లో జలియన్వాలాబాగ్ ఉదంతం జరిగింది. * 1919లో రౌలత్ చట్టాన్ని విధించారు. * 1919లో కిలాఫత్ ఉద్యమం * 1920లో జవహర్ లాల్ నెహ్రు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. * 1921లో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించారు. * 1921లో రవీంద్రనాధ్ ఠాగూర్ విశ్వభారతిని స్థాపించారు.
* 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. * 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని కాన్పూర్లో స్థాపించారు. * 1928లో సైమన్ కమిషన్ ఇండియా వచ్చింది. * 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్ డిక్లేరేషన్ని కాంగ్రెస్ ఆమోదించింది. * 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. * 1931లో ఇర్విన్ ఒడంబడిక జరిగింది. * 1931లో భగత్ సింగ్ని ఉరితీశారు. * 1932లో పూనా ఒడంబడిక జరిగింది. * 1932లో రెండవ రౌండ్ టెబుల్ సమావేశం జరిగింది. * 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
* 1934లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. * 1936లో నెహ్రు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. * 1942లో క్విట్ఇండియా ఉద్యమం జరిగింది. * 1942లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు.
|