సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » కథనాలు » ఆర్థికమాంద్యం ఎందుకు వచ్చింది...? (Global financial crisis | US | economy | Bank | Besh | Lehman brothers)
 
FILE
అమెరికాలోని జనరల్ మోటార్స్ సంస్థలో పని చేసే ఉద్యోగి నెలసరి జీతం రూ. 27 వేలు ఉండగా అదే ఉద్యోగి భారతదేశంలోని కార్మికుల జీతంగా ఐదు వందల రూపాయలు తీసుకునేవారు. ఇదే పరిస్థితి కాల్ సెంటర్లలోను ఉండేది. అంటే అమెరికాలోని ఉద్యోగుల జీతభత్యాలు ఆకాశాన్నంటేటివి. భారతదేశంలోని ఉద్యోగుల జీతభత్యాలు కాస్త మెరుగ్గా ఉండేటివి. ఓవైపు అమెరికాలోని పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం ప్రారంభించడంతో వారి ఆదాయం తగ్గుముఖం పట్టింది. దీంతో వారు గృహ రుణాలు కట్టలేక పోయారు.

దీంతో సదరు బ్యాంకులు వారి గృహాలను జప్తు చేసాయి. జప్తు చేసిన గృహాలు, వస్తువులను అమ్మేందుకు బ్యాంకులు ప్రయత్నించగా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో ప్రాపర్టీ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యాంకులు నష్టాల బాటలో పయనించడం మొదలు పెట్టాయి. ఏ ప్రాపర్టీ మీదైతే బ్యాంక్ ఐదు లక్షల డాలర్ల అప్పు ఇచ్చిందో, అదే ప్రాపర్టీని జప్తు చేసుకున్న తర్వాత దానిని కేవలం రెండు లక్షల డాలర్లకే అమ్మేందుకు సిద్ధమైంది. దీనినిబట్టి పరిస్థితి ఎంత దిగజారిందో అంచనా వేసుకోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇలా పలు బ్యాంకులు మాంద్యంలో మునిగిపోయాయి. తొలుత లెహ్‌మన్ బ్రదర్స్, బీమా కంపెనీ ఏఐజీ మరియు మేరిల్ లించ్ కంపెనీలు చేతులెత్తేసాయి. దీంతో అమెరికాలోని పలు కంపెనీలు మాంద్యంతో అతలాకుతలమైయ్యాయి.

ఏవిధంగానైతే క్యాన్సర్ రోగికి ప్యారాసిటమాల్ మాత్రలు ఇస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి మళ్ళీ తిరగతోడుతుంది. అదే పరిస్థితి ఆర్థిక రంగంలోను తలెత్తిందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

ప్రస్తుత మాంద్యానికి కారణం అమెరికానే ప్రథమ సూత్రమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
IFM


తప్పెవరిది: అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తలెత్తేందుకు ప్రధాన కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడు ఏలన్ గ్రీన్‌స్పైన్‌లేనని ఆర్థిక నిపుణులు ఘంటాపదంగా చెపుతున్నారు. బుష్ భవిష్యత్తులో రాబోయే మాంద్యం గురించి ముందుగానే పసిగట్టి ఉంటే ఇంత భారీ నష్టం సంభవించేది కాదంటున్నారు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.