"గిటెక్స్ దుబాయ్ 2007" ఎగ్జిబిషన్లో భారత్ ఐటీ కంపెనీలు
"గిటెక్స్ దుబాయ్ 2007" ఐటీ ఎగ్జిబిషన్లో భారత్కు చెందిన 30 కంపెనీలు పాల్గొననున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్సీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో ఐటీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా పాల్గొననున్నాయి.
ఐటీరంగ విస్తరణ దిశగా ఏర్పాటవుతున్న గిటెక్స్ ఎగ్జిబిషన్ ప్రపంచ వ్యాప్తంగా మూడోసారి జరగడం గమనార్హం. ఈ విషయమై ఈఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డీకే సరీన్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న ఐటీ కంపెనీలు, అవుట్సోర్స్ కంపెనీలు, డెవలపర్స్ తమ తయారీలను, వాటికి సంబంధించిన సొల్యూషన్లు ఈ ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.
తద్వారా పలు ఐటీ సంస్థలు గుల్ఫ్ డిజిటల్ మార్కెట్లో స్థానం సంపాందించుకునే అవకాశం ఉందని సరీన్ వివరాలందించారు.
ఐటీరంగ విస్తరణ దిశగా ఏర్పాటవుతున్న గిటెక్స్ ఎగ్జిబిషన్ ప్రపంచ వ్యాప్తంగా మూడోసారి జరగడం గమనార్హం. ఈ విషయమై ఈఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డీకే సరీన్ విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న ఐటీ కంపెనీలు, అవుట్సోర్స్ కంపెనీలు, డెవలపర్స్ తమ తయారీలను, వాటికి సంబంధించిన సొల్యూషన్లు ఈ ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.
తద్వారా పలు ఐటీ సంస్థలు గుల్ఫ్ డిజిటల్ మార్కెట్లో స్థానం సంపాందించుకునే అవకాశం ఉందని సరీన్ వివరాలందించారు.
