పట్టణాలకు అందుబాటులో అధునాతన వ్యవస్థ
|
తాజాగా భారత్ సెక్యూరిటీ సంస్థ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ అధునాతన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసే అలారం ఇంటికి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే మోగుతుంది. వెంటనే 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉండే కంట్రోల్ రూం సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
వీరు పోలీసులకు సమాచారం అందివ్వడం వల్ల నిందితుల ఆచూకీని సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రమాదాలను నివారించవచ్చు. అంతేకాకుండా.. అపరిచిత వ్యక్తుల ఫోటోలను కూడా తీస్తుంది. దీనివల్ల పోలీసులు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు.
