మొబైల్ రంగం, కంప్యూటర్ రంగం రెండూ వేటికవే సాటి. అయితే దేశ జనాభాలో 80 శాతానికి పైగా మొబైల్ ఎక్కవగా వినియోగిస్తున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని బట్టి మొబైల్ ఫోన్ సగటు మనిషి జీవితంలో ఎంత నిత్యకృత్యమైపోయిందో వేరే చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో మొబైల్, కంప్యూటర్.. ఈ రెండు రంగాలు ఒకతాటిపై నడిస్తే మరో విన్నూత్న శకం ఆరంభానికి నాంది పలికినట్లే. అలాంటి విన్నూత్న శకానికి నాంది పలికి.. విజయం సాధించింది ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ల తయారీ సంస్థల ఆపిల్ కంపెనీ.| మొబైల్ రంగంలోకి కంప్యూటర్ సంస్థలు.. |
| | కంప్యూటర్ స్థాయి ప్రమాణాలతో ఐఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి మొబైల్ రంగంలోకి ఆపిల్ కంపెనీ అడుగిడింది. ఈ ఐఫోన్ విజయంతో అనేక ఇతర కంప్యూటర్ ఉత్పత్తిదార్లు మరియు చిప్ కంపెనీలు మొబైల్ రంగంపై దృష్టి సారించాయి.. |
| |
కంప్యూటర్ స్థాయి ప్రమాణాలతో ఐఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి మొబైల్ రంగంలోకి ఆపిల్ కంపెనీ అడుగిడింది. ఈ ఐఫోన్ విజయంతో అనేక ఇతర కంప్యూటర్ ఉత్పత్తిదార్లు మరియు చిప్ కంపెనీలు మొబైల్ రంగంపై దృష్టి సారించాయి. దీంతో ఆపిల్ విడుదల చేసిన కంప్యూటర్ ప్రమాణాలు గల ఈ ఐఫోన్ కన్నా రానున్న కొత్త స్మార్ట్ఫోన్లో ఎక్కువ ఆప్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొత్త ఐఫోన్లో పూర్తి స్థాయి ఇంటర్నెట్, వివిధ రకాల ప్యాకేజీలు, హై-డెఫినిషన్ చిత్రాలు, వీడియో కాన్ఫరెన్సు తదితరాలు అందిస్తామని పీసీ కంపెనీలు హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను విశ్లేషిస్తే... మొబైల్ ఫోన్ రంగంలో ఐఫోన్ విడుదల అనంతరం... పోటీ విపరీతంగా పెరిగిపోయినట్లు కనబడుతోంది. |