కేంద్రంలోని యూపీఏ సర్కారు పూర్తికాలం మనుగడ సాగించలేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ జోస్యం చెప్పారు. అందువల్ల కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు 2007 లేదా 2008లో జరగవచ్చని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎపుడు కూలిపోతుందో ఖచ్చితంగా చెప్పలేనని చెప్పిన మాజీ ఉప ప్రధాని అణు ఒప్పంపందంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అణు ఒప్పందంపై తమ వ్యతిరేకత, ఆందోళనను కొనసాగిస్తామని అద్వానీ స్పష్టం చేశారు. అణు ఒప్పందం దేశ జాతీయ భద్రకు విఘాతం కలిగించేలా ఉందని అద్వాని మంగళవారం మరోసారి అభిప్రాయపడ్డారు.
|