సర్వపాపహరణం... కాశీ సందర్శనం
|
సాయంత్రం ఏడు నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాయంకాలపు సప్త రుషి హారతిని ఇస్తారు. తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. వెంటనే శృంగార్ లేదా భోగ్ హారతి ప్రారంభమవుతుంది. తొమ్మిది గంటల తర్వాత వెలుపలి నుంచి దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే భక్తులకు లభిస్తుంది. రాత్రి గం. 10.30 ని.లకు శయన హారతి ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు దేవాలయ ద్వారాలను మూసివేస్తారు. ప్రసాదంలో అత్యధికంగా చోటు చేసుకునే పాలు, వస్త్రాలు మరియు ఇతర నైవేద్యాలు పేదవారికి అందిస్తారు. చేరుకునే మార్గం విమానం ద్వారా... దేశంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలకు వారణాసి చక్కగా అనుసంధానమైంది. వారాణాసి నుంచి దేశంలోని అనేక నగరాలకు ప్రతి రోజు దేశీయ విమాన సేవలు లభిస్తున్నాయి. ఢిల్లీ-ఆగ్రా-ఖజరహో-వారణాసి రోజువారీ విమాన సేవలు పర్యాటకులలో బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. రైలు ద్వారా... |
అనుసంధానమైంది. కాశీ జంక్షన్, వారాణాసి జంక్షన్ (వారణాసి కంటోన్మెంట్గా ప్రసిద్ధి) పేరిట రెండు రైల్వే స్టేషన్లు వారణాసిలో ఉన్నాయి. అంతేకాక ఢిల్లీ లేదా కోల్కతా నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు వారణాసి మీదుగా ప్రయాణిస్తుంటుంది.
రోడ్డు ద్వారా... సమతలమైన గంగా పీఠభూమి ప్రాంతాల్లో నెలకొనడంతో వారాణాసికి మంచి రహదారుల నెట్వర్క్ కలదు. ఉత్తర ప్రదేశ్లోని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు తరుచుగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ప్రజలను చేరవేస్తుంటాయి.