| భక్తుల ఇష్టదైవం శ్రీ జగదాంబ మాత |
| | | | ఆదివారం, 22 జూన్ 2008( 15:18 IST ) | | | |
| | |
| |
ఒక డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు గాను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో ఈ గ్రామంలో నిద్రించిన ఇందిరాగాంధీకి మాత కలలోకి వచ్చారు. మరుసటి రోజునే ఆలయాన్ని సందర్శించిన ఇందిరాగాంధీ కొండపైకి భక్తులు సులభంగా వెళ్లేందుకు వీలుగా మెట్లను నిర్మించాల్సిందిగా ఆదేశించినట్టు ఆదేశించారు.
ప్రతి సంవత్సరం ఇక్కడకు పలు లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి తమ ఇష్టదైవాన్ని పూజించుకుని వెళుతుంటారు. ఈ భక్తుల సౌకర్యార్థం ఆలయానికి మరమ్మతులు చేసేందుకు రూ.15 కోట్ల మేరకు ఖర్చు అవుతాయని ట్రస్టు ఛైర్మన్ సురేష్ బాలచంద్రన్ తెలిపారు. ఈ ఆలయం చుట్టూత సుమారు ఇరవై వేల వనమూలికలు, ఇతర ఔషధ మొక్కలు పెంచుతున్నారు.
ఈప్రాంతానికి చేరుకోవడం ఎలా..?
రైలు మార్గం... అహ్మద్ నగర్కు దేశంలోని పలు ప్రాంతాల నుంచి రైలు సేవలు ఉన్నాయి. అహ్మద్ నగర్ నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. రోడ్డు మార్గం.. అహ్మద్ నగర్కు చేరుకుని, అక్కడ నుంచి మొహాదే ప్రాంతానికి వెళ్లాల్సి వుంటుంది. |