దైవ సన్నిధి (కోర్టు)లో హిందూ, క్రైస్తవ, ముస్లిం, సిక్కులు అనే తారతమ్యాలు ఉండవు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఈ వారం తీర్థయాత్రలో ప్రముఖ భక్తి నిలయంగా పేరుగాంచిన మీరాన్ దాతార్ దర్గాను మీకు పరిచయం చేయబోతున్నాం. ఉత్తర గుజరాత్లో ఉన్న ఒక చిన్న గ్రామం ఉనావా. ఈ గ్రామం మెహ్సానా-పాలన్పూర్ రహదారికి సమీపంలో ఉంది. ఈ మారుమూల గ్రామానికి అత్యంత పేరు ప్రఖ్యాతలు రావడానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ గ్రామంలో హజ్రరత్ మీరాన్ సయ్యద్ ఆలీ దాతార్ దర్గా వెలసి ఉండటమే. సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యస్థలం.. ఈ గ్రామం ఆవిర్భావానికి ప్రతీకగా చెపుకుంటారు. ఈ ప్రాంతానికి కేవలం ముస్లిం మతస్థుల వారు మాత్రమే కాకుండా.. వందలాది మంది హిందువులతో పాటు.. ఇతర మతస్థులు వస్తుంటారు. పేరొందిన ఈ పుణ్యస్థలంగా ఉన్న ఈ దర్గాకు దెయ్యాలు పట్టిన బాధితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఈ స్థలానికి చేరుకున్న మరుక్షణమే సంపూర్ణ భక్తిభావం ఉట్టిపడుతుంది.
ఈ దర్గా ప్రాశస్త్యంతో పాటు చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన హిందూ కవి షాహ్ షోరత్ ముస్లిం మతస్తుడైన సయ్యద్ ఆలీకు మీరాన్ దాతార్ అనే పేరు పెట్టారు. మీరాన్ అంటే.. ప్రేమించేవాడు. దాతార్ అంటే సేవ చేసేవాడు. అప్పటి నుంచి సయ్యద్ ఆలీ మీరాన్ దాతార్ అనే పేరు వచ్చినట్టు చెపుతున్నారు. మీరాన్ భుక్రాన్ నుంచి భారత్కు వచ్చారు. అహ్మదాబాద్లోని ఖన్పూర్ నగరంలో 879 సంవత్సరంలో (ఇస్లాం క్యాలెండర్ మేరకు) 29వ తేది రంజాన్ నెలలో మీరాన్ జన్మించారు.
|