ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథ్ హనుమాన్ మరియు సోమనాథ్ మహదేవ్ దేవుళ్లకు చెందిన మరో రెండు చిన్న చిన్న ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ చిన్న ఆలయాల్లో స్వామి చిదానంద పాదముద్రికలు ఉన్నాయి.శ్రావణమాసంలో ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. త్రయోదశినాడు వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని దీవెనలు అందుకుంటారు. ఆలయంలో భక్తులకు ఉచిత భోజన వసతి కలదు. భోజన ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది.ఎలా వెళ్లాలి: రోడ్డు మార్గం: గాంధీనగర్కు వడోదర 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక గుజరాత్ రాజధాని అహ్మదాబాదు నుంచైతే 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు ద్వారా: ఢిల్లీ- ముంబై రైలు మార్గంలో వడోదర ప్రధాన రైలు జంక్షన్. దేశంలోని ప్రధాన నగరాల నుంచి వడోదరకు రైలు సౌకర్యం ఉన్నది. విమానం ద్వారా: వడోదరకు సమీపంలో ఉన్న విమానాశ్రయం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు. ఇక్కడ నుంచి వడోదరకు 111 కిలో మీటర్ల దూరం ఉంటుంది. |