1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus Updates in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోతున్న కరోనా వైరస్ ...

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వదలి వెళుతోంది. గత 24 గంటల్లో 2,886 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తం 84,401 కరోనా టెస్టులు నిర్వహించారు. 
 
అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 493 కేసులు రాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 36 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో రాష్ట్రంలో 17 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 6,676కి పెరిగింది. 
 
తాజాగా 3,623 మందికి కరోనా నయం అయినట్టు ఇవాళ్టి బులెటిన్‌లో వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు 8,20,565 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,88,375 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 25,514 మంది చికిత్స పొందుతున్నారు. 
 
అనంతపూరంలో 1198, చిత్తూరు 2450, ఈస్ట్ గోదావరి 4752, గుంటూరు 3498, కడప 1377, కృష్ణ 3248, కర్నూలు 438, నెల్లూరు 255, ప్రకాశం 1395, శ్రీకాకుళం 917, విశాఖపట్టణం 1986, విజయనగరం 376, వెస్ట్ గోదావరి 3624 చొప్పున ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కమల్‌నాథ్‌కు షాకిచ్చిన ఈసీ - స్టార్ క్యాంపెయినర్ హోదా రద్దు!