శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (17:39 IST)

#GSAT6A : జీఎస్ఎల్వీ ఎఫ్-08 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు (Video)

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ప్రయోగ కేంద్రం షార్ సెంటర్ నుంచి గురువారం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 08 రాకెట్‌‌ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ప్రయోగ కేంద్రం షార్ సెంటర్ నుంచి గురువారం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 08 రాకెట్‌‌ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-6ఏ నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గురువారం సాయంత్రం 4.56 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్.. 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. 
 
ఈ ప్రయోగం విజయవంతంకావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం తర్వాత ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్ ప్రతి శాస్త్రవేత్తను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో స్వదేశీ క్రయోజనిక్ వ్యవస్థపై ఇస్రో పట్టుసాధించనట్టయింది. 
 
దీనివల్ల కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ శాటిలైట్ పదేళ్ళ పాటు సేవలు అందించనుంది. దీని బరువు 2130 కేజీలు. ఈ ఉపగ్రహంలో 5ఎస్, 1సి బాండ్ బీమ్‌లను అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతంకావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.