గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (16:10 IST)

విశాఖలో కుప్పకూలిన భారీ క్రేన్: 10 మంది మృత్యువాత

విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో శనివారం భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి చెందారు. క్రేన్ మరమ్మతులకు గురైన కారణంగా దాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. క్రేన్ కూలిన సమయంలో అందులో అధికారులు మరియు ఆపరేటర్లు తనిఖీ చేస్తున్నారు. అందులో చాలామందిని చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు.
 
అనేక మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకు కనీసం ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి 10 మంది మృత్యువాత పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.