1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (16:10 IST)

ఆటో, వ్యాను ఢీ.. ముగ్గురు విద్యార్థు మృతి

ఉదయమే ఆడుతూ పాడుతూ తయారై పాఠశాలకు బయలుదేరిన విద్యార్థులు గంటలోపే శవాలై తిరిగి వచ్చారు. వారిని చూసిన తల్లిదండ్రులు జీవచ్చవాలయ్యారు. ఆటో ఢీను స్కూలు వ్యాను ఒకటి ఢీకొనడంతో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఓ గ్రామ విద్యార్థులు కొందరు ఆటోలో బయలుదేరారు తీపనూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతులందరూ యూకేజీ విద్యార్థులు. 
 
ఆటోలో ఎక్కువగా చిన్న పిల్లలు ఉండటంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని గూడూరు ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. జాయింట్ కలెక్టర్ రేఖా రాణి ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.