1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (07:00 IST)

టీటీడీ పాలక మండలిలో 30 మంది.. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది

తిరుమల తిరుపతి దేవస్థానానికి 30మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. వీరిలో నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉంటారు.

ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత బోర్డుల నియామకం సమయంలోనూ ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య పరిమితంగా ఉండగా ఈసారి మాత్రం ఏకంగా 50మందిని నియమించింది. దీంతో మొత్తం బోర్డు సభ్యులు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తో కలుపుకుని 81 మంది అయ్యారు.
 
కొత్త పాలక మండలి..
1. పొలకల అశోక్‌కుమార్, 2. మల్లాడి కృష్ణారావు 3.టంగుటూరు మారుతీ ప్రసాద్, 4. మన్నే జీవన్‌రెడ్డి, 5. డాక్టర్‌ బండి పార్థసారథిరెడ్డి, 6. జూపల్లి రామేశ్వరరావు, 7. ఎన్‌. శ్రీనివాసన్, 8. రాజేష్‌ శర్మ, 9. బోరా సౌరభ్, 10. మూరంశెట్టి రాములు, 11. కల్వకుర్తి విద్యాసాగర్, 12. ఏపీ నందకుమార్, 13. పచ్చిపాల సనత్‌కుమార్, 14. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 15. డాక్టర్‌ కేతన్‌ దేశాయి, 16.బూదాటి లక్ష్మీనారాయణ, 17. మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్, 18. ఎంఎన్‌ శశిధర్, 19 అల్లూరి మల్లేశ్వరి, 20. డాక్టర్‌ ఎస్‌.శంకర్, 21. ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌రెడ్డి, 22. బుర్రా మధుసూదన్‌యాదవ్, 23. కిలివేటి సంజీవయ్య, 24. కాటసాని రాంభూపాల్‌రెడ్డి 
 
ఎక్స్‌ అఫీషియో సభ్యులు 
1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో

ప్రత్యేక ఆహ్వానితులు:
1. భూమన కరుణాకర్‌ రెడ్డి
2. సుధాకర్‌ (బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌)
 
ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది 
50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని, పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అయితే ఓటు హక్కు మాత్రం ఉండదు.