శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (14:38 IST)

బౌద్ధారామాలకు ప్రేమ జంటలు.. 32 యువతులపై అత్యాచారం.. ముఠా అరెస్ట్

32 మంది విద్యార్థినులపై 20 మందితో కూడిన ఓ ముఠా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. ఏపీ, గోదావరి జిల్లాలోని బౌద్ధారామాలకు ప్రేమ జంటలు ఎక్కువగా వస్తుంటారు. జన సంచారం లేని ఈ ప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను ఓ ముఠా టార్గెట్ చేసింది. ఇటీవల ఈ ప్రాంతానికి నవీన్-శ్రీ అనే జంట వచ్చింది. 
 
వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఓ ముఠా.. నవీన్‌పై దాడి చేసి.. శ్రీపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడింది. ఇంకా శ్రీని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ క్రమంలో పొట్లూరి అనే వ్యక్తి వద్ద జరిపిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లూరితో పాటు సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కూడిన ముఠా ఇదివరకు 32 యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ ముగ్గురు యువకులను.. ఇద్దరు యువతులను హతమార్చినట్లు తేలింది. వీరిచే అత్యాచారానికి గురైన 32మంది యువతులు 20ఏళ్లకు లోబడిన వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మానవ మృగాలకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.