శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 4 మే 2016 (21:28 IST)

విషం తాగావుగా... ఇక చావు... ప్రియుడిపై ప్రియురాలి కసి.. గుంటూరులో....

ఇది సినిమా కథ కాదు నిజమే. ఓ ప్రేయసి తన ప్రియుడు మోసం చేశాడన్న కసితో ప్రియుడిని నమ్మించి విషం తాగించి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో వెంకటేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కా

ఇది సినిమా కథ కాదు నిజమే. ఓ ప్రేయసి తన ప్రియుడు మోసం చేశాడన్న కసితో ప్రియుడిని నమ్మించి విషం తాగించి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో వెంకటేష్ అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక వెంకటేష్ తల్లిదండ్రుల నిర్ణయం మేరకు గత శుక్రవారం తన మేనమామ కుమార్తెకు తాళి కట్టాడు. దీనితో ప్రియురాలు రగిలిపోయింది. 
 
మరోవైపు ఆమె సోదరులిద్దరూ వెంకటేష్ వద్దకు వచ్చి... అయిందేదో అయింది పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. వెంకటేష్ వారిని అనుసరించాడు. పార్టీలో ఆ ఇద్దరు సోదరులు... తమ సోదరిని పెండ్లి చేసుకోకుండా ఎందుకు అన్యాయం చేశావని నిలదీశారు. పరిస్థితి వివరించాడు వెంకటేష్. దానికి సమాధాన పడని ఇద్దరు సోదరులు నేరుగా వెళ్లి తమ సోదరిని వెంటబెట్టుకొచ్చి... ఏమి చేసుకుంటావో చేసుకో అని వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే సగం బిక్కచచ్చిపోయిన వెంకటేష్ ఏం చేయాలో తోచలేదు. 
 
ఇంతలో ప్రియురాలు.... ప్రేమించి మోసం చేశావు. ఇంక ఎందుకూ.. కనీసం చావులోనైనా కలిసి వస్తావా అని అడిగింది. ఇద్దరు చచ్చిపోదామని చెప్పింది. దానికి సరేనన్న వెంకటేష్, పురుగులు మందు తీసుకుని ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వెంకటేష్ పురుగుల మందు రెండు గ్లాసులు తాగేశాడు. 
 
అతడు విషం తాగిన తర్వాత... ఓకే తాగావు కదా. నేను మాత్రం తాగను. చావను. మోసం చేసినందుకు నువ్వే చావాలి అంటూ ఝలక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రియురాలు. దాంతో అతడు పడుతూలేస్తూ ఇంటికి వెళ్లి జరిగిన సంగతి తెలిపాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా పరిస్థితి చేయిదాటిపోయింది. అతడు మృత్యువాత పడ్డాడు. అతడి తల్లిదండ్రులు సదరు యువతిపై కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.