శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (15:10 IST)

షాకింగ్... శవంతో శృంగారం చేసిన కామాంధుడు.. ఎక్కడ..?

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలోని నవభారత్ నగర్ కాలనీ అది. తెల్లవారుజామున ఇంటి నుంచి ఏడుపులు. గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. 15 సంవత్సరాల ఒక యువతి చనిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి యువతిని హత్య చేశారని నిర్థారించారు. యువతి కుటుంబ సభ్యులను విచారించి నిందితుల కోసం గాలించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
 
నవభారత్ కాలనీకి చెందిన ముగ్గురు పిల్లల తండ్రి గోవింద్. తన ఇంటి పక్కనే ఉన్న 15 యేళ్ళ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మాయమాటలు చెప్పి ఒకటిన్నర సంవత్సరం ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ యువతికి అబార్షన్ కూడా చేయించాడు. తాను చేస్తున్న బాగోతాన్నంతా తన శిష్యుడు యతిరాజులకు చెబుతూ వచ్చేవాడు. తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిన భార్య మందలించింది. అయినా అతనిలో మార్పు రాలేదు.
 
యువతి నుంచి కూడా గోవింద్‌కు ఒత్తిడి పెరిగింది. ఆ యువతి పెళ్ళి చేసుకోమని కోరింది. అయితే గోవింద్ ప్లాన్ వేశాడు. ఎలాగైనా ఆ యువతిని చంపేయాలనుకున్నాడు. తన శిష్యుడు యతిరాజులుకు డబ్బులు ఇచ్చి ఆ యువతిని చంపేయమని ఇద్దరూ కలిసి పూటుగా మద్యం సేవించారు. ఆ యువతి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో యతిరాజులు ఇంట్లోకి వెళ్ళాడు. తన గురువు చెప్పినట్లు చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అంతకుముందుగా ఆ యువతిని కోరిక తీర్చమన్నాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు.
 
కోపంతో రగిలిపోయాడు. చీరతో ఆ అమ్మాయి మెడకు చుట్టేశాడు. ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళి కొద్దిసేపటికి చనిపోయింది. చనిపోయిన యువతితో శృంగారం చేశాడు. ఆ తరువాత అనుమానం రాకుండా ఉండాలని ఫ్యాన్‌కు ఉరివేశాడు. ఆ తరువాత పారిపోయాడు. పోలీసుల విచారణలో ఇదంతా బయట పడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.