శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 14 జులై 2018 (17:08 IST)

సుఖం కోసం వేశ్యాగృహానికి వెళితే అమ్మాయి చెప్పింది విని కన్నీరు పెట్టుకున్నాడు?

ఒక మనిషి జీవితంలో ఆశ్చర్యపోయే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి సుఖం కోసం వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ ఆ యువతి చెప్పిన మాటలు విని కన్నీరు ఆపులేకపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోలీసులను ఆశ్రయించాడు. మూడు స

ఒక మనిషి జీవితంలో ఆశ్చర్యపోయే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి సుఖం కోసం వేశ్యా గృహానికి వెళ్ళాడు. అక్కడ ఆ యువతి చెప్పిన మాటలు విని కన్నీరు ఆపులేకపోయాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని పోలీసులను ఆశ్రయించాడు. మూడు సంవత్సరాల నరక యాతన తరువాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదు గుంటూరు జిల్లా చిలుకూరిపేటలో జరిగిన సంఘటన.
 
వినోద్.. విజయవాడలోని ఒక ప్రైవేటు కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ యువకుడు మొదటిసారి వేశ్యా గృహానికి వెళ్ళాడు. అది కూడా గుంటూరు జిల్లా చిలకూరిపేటలో. ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఐదువేలు కట్టి ఒక యువతిని బుక్ చేసుకున్నాడు. సాయంత్రం అమ్మాయి గదిలోకి వచ్చింది. గదిలో ఉన్న వినోద్‌ను చూడగానే ఎందుకో ఆ అమ్మాయి బోరున విలపించింది. తనకు బాగా తెలిసిన పరిచయస్తుడిలా అతనితో తన జీవితంలో జరిగిన బాధను వివరించింది.
 
గుంటూరు నగరానికి చెందిని యువతి మహారాష్ట్రకు చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులను ఎదిరించి అతన్ని వివాహం చేసుకుంది. ఆ తరువాత విజయవాడలో కాపురం పెట్టాడు యువకుడు. రెండునెలల పాటు వీరి సంసారం బాగానే సాగింది. ఆ తరువాత తన ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి మహారాష్ట్రకు వెళ్ళాడు ఆ యువకుడు. వారంరోజుల పాటు రాలేదు. వారం తరువాత ఇంటికి వచ్చి మా అమ్మా,నాన్న నిన్ను చూడాలంటున్నారని చిలకలూరిపేటకు తీసుకొచ్చాడు. అక్కడ ఒక వేశ్యాగృహంలోకి నెట్టేసి డబ్బులు తీసుకుని పారిపోయాడు. దీంతో మూడు సంవత్సరాల ఆ యువతి అక్కడే ఉండిపోయింది. 
 
తప్పించుకోవడానికి ప్రయత్నించినా, ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆ యువతి బోరున విలపించింది. దీంతో ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు. కంట కన్నీరు ప్రారంభమైంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన యువకుడు ధైర్యం చేసి పోలీసులకు తెలిపాడు. ఆ స్థావరంపై పోలీసులు దాడి చేసి యువతులను బయటకు పంపేశారు. దీంతో ఆ యువతి తిరిగి తన ఇంటికే వెళ్ళిపోయింది. మూడు సంవత్సరాల నరక యాతన నుంచి బయటకు తీసుకువచ్చిన వినోద్ కాళ్ళపై బడి దణ్ణం పెట్టి మరీ ఆ యువతి కన్నీరు పెట్టుకుందట.