శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (11:20 IST)

కొత్తగా పెళ్లైంది.. భర్తతో విభేదాలు.. వేరొకరితో సహజీవనం.. అనుమానస్పద మృతి.. ఎలా?

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే భర్త వేధింపులు తాళలేక.. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వేరొకరితో సహజీవనం చేసింది. కానీ అనుమానస్పద స్థితిలో మృతి చెం

కొత్తగా పెళ్లైంది. రెండు నెలలు కూడా గడవలేదు. భర్తతో కలిసి 15 రోజులే కాపురం చేసింది. అయితే భర్త వేధింపులు తాళలేక.. ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వేరొకరితో సహజీవనం చేసింది. కానీ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి మెడపై ఉరితీసిన గుర్తులుండడంతో ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ధర్మకోట గ్రామానికి చెందిన మల్లాడి రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణవేణి(20)ని ఫ్రెంచి యానాంకు చెందిన సంగాని సత్యనారాయణకు 2016 డిసెంబరు 1న వివాహం చేశారు. వీరిద్దరూ 15 రోజుల పాటే కాపురం చేశారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు వేధింపులకు దారితీసింది. భర్త వేధింపులు తాళలేక కృష్ణవేణి అమలాపురానికి చేరుకుంది. 
 
స్థానికంగా తాపీ పనిచేస్తున్న చుట్టుగుళ్ల నానితో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కామనగరువు శివారు అబ్బి రెడ్డివారికాలనీలో భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. తాపీపని చేసుకునే నాని రెండ్రోజులకొకసారి వస్తానని ఇంటివారిని నమ్మించి కృష్ణవేణిని చూసుకోమని చెప్తుండేవాడు. కృష్ణవేణి స్థానిక ముస్లింవీధిలోని గణేష్‌ కిరాణామర్చంట్స్‌లో పనిచేసేది. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 29 ఉదయం ఇంట్లో కృష్ణవేణి స్పృహలేకుండా పడి ఉండడాన్ని ఇంటి యజమాని గుర్తించారు. కృష్ణవేణిని పరిశీలించిన వైద్యులు ఆమె మెడపై ఉరి వేసినట్టు గుర్తులు ఉన్నట్టు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక హత్యచేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.