గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 3 జనవరి 2019 (18:32 IST)

సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?

సెల్ ఫోన్ మాయాజాలంలో యువత పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒక భాగం సెల్ ఫోన్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్స్‌తో నిత్యం చాట్ చేస్తూ సెల్ ఫోన్‌కే కుమారుడు అతుక్కుపోతుండటంతో అతడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. 
 
విజయవాడలోని పాయవరావుపేటలో నివాసముంటున్న గోపీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో ఫోన్లో నిత్యం చాట్ చేస్తూ ఉండేవాడు. వాట్సాప్, ఫేస్ బుక్‌లతోనే ఎప్పుడూ పని. దీంతో కుమారుడిని మందలించాడు రంగ. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన గోపీనాథ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తండ్రి అతన్ని అడ్డుకున్నాడు. అయితే అప్పటికే గోపీనాథ్ శరీరం పాక్షికంగా కాలింది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.