గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (18:58 IST)

సంసారానికి పనికిరాడు.. తొలిరోజు రాత్రే భార్యను అలా ఫోటోలు తీసి?

పెళ్లైన తొలిరోజే.. నవ వధువుకు చుక్కలు చూపించాడు కట్టుకున్న భర్త. తన భర్త సంసారానికి పనికిరాడనే విషయం.. ఆ నవ వధువుకు శోభనం రోజే తెలిసింది. దీంతో తను మోసపోయానని తెలిసి షాక్ తింది. అంతేగాకుండా సదరు భర్త ఆమె తాలూకు నగ్న చిత్రాలు తీయడంతో కొత్తగా పెళ్లైన

పెళ్లైన తొలిరోజే.. నవ వధువుకు చుక్కలు చూపించాడు కట్టుకున్న భర్త.  తన భర్త సంసారానికి పనికిరాడనే విషయం.. ఆ నవ వధువుకు శోభనం రోజే తెలిసింది. దీంతో తను మోసపోయానని తెలిసి షాక్ తింది. అంతేగాకుండా సదరు భర్త ఆమె తాలూకు నగ్న చిత్రాలు తీయడంతో కొత్తగా పెళ్లైన ఆ అమ్మాయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తను సంసారానికి పనికిరాననే విషయాన్ని బయటపెడితే నగ్న చిత్రాలను బయటపెడతానని ఆమెను అతడు బెదిరించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన రాజేంద్రప్రసాద్‌కు ఆగస్టు రెండో తేదిన వివాహమైంది. రాజేంద్రప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే పెళ్లి సమయంలో వధువు కుటుంబసభ్యులు రూ. 45లక్షల కట్నం ఇచ్చారు. కానీ రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడనే విషయం.. తొలి రోజు రాత్రి నవవధువుకు తెలిసింది. 
 
కానీ రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబితే తన నగ్న చిత్రాలను బయట పెడతానని తన భర్త తనను బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని.. తన అత్తమామలకు కూడా చెబితే బెదిరించారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా తనకు టీబీ వుందని తప్పుడు ప్రచారం చేశారని చెప్పింది.
 
తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రెండో పెళ్లి చేసుకొనేందుకు వీలుగా తనకు విడాకులు కావాలని రాజేంద్రప్రసాద్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని  బాధితురాలు ఆరోపిస్తోంది. తన మాదిరిగా మరో యువతి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను మీడియాను ఆశ్రయించినట్టు బాధితురాలు వెల్లడించింది.