చంద్రబాబు ఆదర్శ ముఖ్యమంత్రి : పియూష్ గోయల్
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధుడు, ఆదర్శ ముఖ్యమంత్రి అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రశంసించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర విద్యుత్ సరపరా ఒప్పందంపై మంగళవారం సంతకాలు జరిగాయి. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రతిపాదించిన యాభై రోజులలోనే ప్రాజెక్టును చంద్రబాబు ఓకే చేయించుకున్నారన్నారు. సాధ్యమైనంత త్వరగా నిరంతరం విద్యుత్ను సరపరా అమలవుతుందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, అనంతపురం, కర్నూలులలో 2500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.