శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (23:36 IST)

బోరు బావి నుంచి బయటపడ్డ బాలుడు చంద్రశేఖర్‌కు సీఎం రూ.2 లక్షలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఉమ్మడివరం గ్రామంలో బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఈ డబ్బు అతడికి 20 ఏళ్లు వచ్చేసరికి 20 లక్షల రూపాయలు అవుతుందని వెల్లడించారు. 
 
ఇకపోతే బోరుబావులు రాష్ట్రంలో ఎక్కడయినా పూడిక తీసి నీరు లేకుండా అలానే వున్నట్లయితే వాటిని తక్షణమే పూడ్చివేయాలని సూచించారు. ఇందుకు సంబంధంచి అధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేయాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అన్నారు.