గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (09:43 IST)

విజయవాడలోనే చంద్రబాబు.. 24/7 ప్రజల పక్షానే వుంటున్న సీఎం (video)

AP CM
AP CM
విజయవాడలో కురుస్తున్న వర్షాలు జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగించాయి. ఈ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. 
 
విద్యుత్- ఆహారం వంటి కనీస అవసరాలను అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రతి రెండు గంటలకు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వారి తక్షణ అవసరాలను అంచనా వేయడానికి స్థానికులతో నేరుగా సంభాషిస్తూ, అందుబాటులో ఉండేలా చూసుకున్నారు చంద్రబాబు.
 
దుర్గమ్మ ఆలయంలో రెస్టారెంట్లతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఉదయాన్నే భోజనం అందించడానికి ఏర్పాట్లు చేశారు చంద్రబాబు. విజయవాడలో ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని, కమాండ్ చేయడానికి కాదని చంద్రబాబు పదే పదే హామీ ఇచ్చారు. 
 
24/7 ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయం ఇదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వచ్చే 2-3 రోజుల పాటు అక్కడే ఉంటానని, అన్నీ స్వయంగా పర్యవేక్షించేందుకు అందుబాటులో ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.